విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యాలపై అధికారులు ఫీడ్ బ్యాక్ సేకరిస్తున్నారు. రోజుకు సుమారు 30 వేల మందికి IVR కాల్స్ చేసి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇప్పటివరకు 87 శాతం మంది భక్తులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇకపై పోలీసుల పనితీరుపైనా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని సీపీ రాజశేఖర్ బాబు ఆదేశించారు.