ASR: పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జయరాజు రైతులకు సూచించారు. గురువారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమగ్ర పెరటికోళ్ల యూనిట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెరటికోళ్ల యూనిట్లలో జీవ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సరైన ఆహార నియమాలు అనుసరించి, కోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు.