ASR: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. గురువారం పాడేరు మండలంలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో ఉన్న పుస్తకాలతో పోలిస్తే, ఇప్పుడు అందజేస్తున్న రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రతను కల్పిస్తాయన్నారు.