KRNL: గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని గురువారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ గీతా ప్రియదర్శిని, మండల సర్వేయర్ తేజస్వినిలకు గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్వేయర్లు ఓంకార్, తిమ్మేష్, పరుశురాం, లలిత, మౌనిక మాట్లాడుతూ రూ. 30 వేలు బేసిక్ పేతో పాటు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.