ప్రకాశం: కంభం మండలంలోని చిన్న కంభం, హజరత్ గూడెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ.. కంభం ప్రాంతంలో పప్పు శనగ, కందుల కొనుగోల కేంద్రం మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.