MHBD: విద్యాలయాల ద్వారా ఆరోగ్యం, ఉత్తమ విద్య బోధనలు పిల్లలకు అందించాలిని కలెక్టర్ స్నేహ శబరిష్ అన్నారు. బయ్యారం మండలంలోని ఇస్లాపురం గిరిజన ఆశ్రమ పాఠశాల, అంగన్వాడి కేంద్రం, ప్రాథమిక పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.స్టాక్,రిజిస్టర్, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్, స్టోర్ గది, డైనింగ్ హాల్, కిచెన్ షెడ్, స్టడీ రూమ్, పరిసరాలను పరిశీలించారు.