నెల్లూరు: కావలి డీఎల్పీఓ వెంకటరమణ గురువారం విడవలూరు మండలంలో పర్యటించారు. అనంతరం మండలంలోని విడవలూరు, అలగానిపాడు, దండిగుంట, గాదెలదిన్నె గ్రామపంచాయతీలలో ఇంటి పన్నులు వసూలును తనిఖీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి పన్నులు చెల్లించాలన్నారు. గ్రామపంచాయతీకి పన్ను బకాయిలు ఉన్నవారందరూ, ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతున్నందున ఖచ్చితంగా బకాయిలు చెల్లించాలన్నారు.