AP: అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండానే YCP సభ్యులు జీతాలు తీసుకుంటున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు విమర్శించారు. అయితే, జగన్ మాత్రం జీతం తీసుకోవడం లేదని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగం రోజు హాజరైనా, దాన్ని సాధారణ హాజరుగా పరిగణించబోమన్నారు. వరుసగా 65 రోజులు సభకు రాకపోతే సభ్యులకు నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. జగన్కు ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని పేర్కొన్నారు.