WNP: సెప్టెంబర్ 17న వనపర్తి జిల్లాలో ప్రజా పాలన దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ వేడుకలు ఐ.డీ.ఒ.సీ ప్రాంగణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. చీఫ్ విప్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు.