KRNL: రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. ప్రజలు ఎండలకు జాగ్రత్తలు తీసుకోవాలని, మంచినీరు, శీతల పానీయాలు, ఫ్రూట్, పోషకాలు కలిగిన ఆహారం తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.