AP: కాపీ కొట్టడం తప్ప కూటమి నాయకులు ఒరిజనల్గా ఏమీ చేయలేరని YCP నేత మేకపాటి విక్రమ్ రెడ్డి విమర్శించారు. సమగ్ర భూసర్వే, తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించారని.. ఈ సారి అలా జరగదని, YCP మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆత్మకూరు(నెల్లూరు) అభివృద్ధి కోసం ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకుంటూ, YCP ప్రభుత్వం వచ్చేలా కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలన్నారు.