KDP: సిద్ధవటం మండలంలోని లింగంపల్లి గ్రామ శివారులో వెలసిన శ్రీ వీరాంజనేయ స్వామికి శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ మేరకు అర్చకులు సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూల అలంకరణ, త్రికాలారాధన వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు అధిక సంఖ్యాలో పాల్గొని స్వామివారి దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.