W.G: భూ పరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి బుధవారం సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పీజీఆర్ఎస్ వినతులు మళ్లీ రీ-ఓపెన్ కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మార్చిలో నిర్దేశించిన పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలని, భూముల రీ-సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.