ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత తన వ్యవసాయ క్షేత్రంలో పర్యటించారు. రాజకీయాల్లో బిజీబిజీగా గడిపే ఆమె శుక్రవారం వెంకటాపురంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను పరిశీలించారు. కూలీలతో మాట్లాడి పంటలపై ఆరా తీశారు. అనంతరం వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కలియతిరిగారు. పంటకు సమయానికి నీరు, రసాయన మందులు, ఎరువులు వేయాలని కూలీలకు సూచించారు.