NGKL: రాష్ట్ర పంచాయతీరాజ్ ఔట్సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్స్ యూనియన్ అధ్యక్షుడిగా జిల్లా వాసి సుగుణాకర్ ఎన్నికయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఆపరేటర్లకు గత 8 నెలలుగా జీతాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ వేతనాలు విడుదల చేయాలని ఆయన కోరారు.