AKP: నర్సీపట్నం నియోజకవర్గంలో టమాటా పండించే రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ తెలిపారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాల మేరకు టమాటా పంటకు అధిక ధర వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. రైతులు ముందుగా వ్యవసాయ మార్కెట్ కమిటీ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు.