AP: ఎరువుల విషయంలో స్కాంలు చేయకపోతే ఈ పరిస్థితి వచ్చేది కాదని మాజీ సీఎం జగన్ అన్నారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్మార్కెట్కు తరలిస్తున్నారని ఆరోపించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓలకు నోటీసులు ఇచ్చే కార్యక్రమం చేశామని గుర్తు చేశారు. అయితే రైతు ఉద్యమాన్ని అణగదొక్కుతూ అర్థరాత్రులు నోటీసులు ఇచ్చారని.. రైతుల కోసం పోరాడితే తప్పా? అని నిలదీశారు.