WGL: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో LLB పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈనెల 12న నిర్వహించాల్సిన ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షలతో పాటు, అదేరోజు జరగాల్సిన ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్ (మూడో పేపర్) పరీక్షను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె. రాజేందర్ తెలిపారు. ఆ రెండు పరీక్షలు ఈనెల 15న నిర్వహించనున్నామని వారు పేర్కొన్నారు.