AP: మండలిలో వైసీపీ, టీడీపీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంపై చర్చ సమయంలో గందరగోళం నెలకొంది. భోలే బాబా డెయిరీకి ఆవులు లేవని వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతుండగా అధికారపక్షం అడ్డుకుంది. ఛైర్మన్ వెల్లోకి ఇరుపార్టీల సభ్యులు దూసుకొచ్చారు. దీంతో అధికారపక్షం తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తామని వైసీపీ పేర్కొంది.