MNCL: మంచిర్యాలలోని ప్రభుత్వ ITI ఆవరణలో ఈనెల 6వ తేదీ ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రవికృష్ణ బుధవారం ప్రకటనలో తెలిపారు. జీవీ అరణ్య మోటార్స్లో 17 ఖాళీలు ఉన్నాయన్నారు. 18 నుంచి 35సం:ల వయసు గల అర్హులైన నిరుద్యోగ యువకులు జాబ్ మేళాలో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.