KRNL: పెద్దకడబూరులోని పెద్దబావి సమీపంలో మఠం వద్ద చేతిపంపు చెడగపోయి నెలలు గడుస్తున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు బుధవారం వాపోయారు. వేసవి సమీపిస్తున్న వేళ నీటి కట కట మొదలయింది. చేతిపంపు ద్వారా వచ్చే నీటిని కుటుంబ అవసరాలకు వాడుకుందామని ఆశిస్తున్న కాలనీవాసులకు అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.