AP: ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు నిర్వహించేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు, పోస్టుల హేతుబద్ధీకరణకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు రూపొందించింది. టీచర్ల బదిలీలకు మే 30 వరకు ఉన్న సర్వీసును పరిగణనలోకి తీసుకోనున్నారు. ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల హేతుబద్ధీకరణ జరగనున్నట్లు సమాచారం.