SRPT: నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలని మునగాల మండల ప్రత్యేక అధికారి శిరీష అన్నారు. మునగాల ఎంపీడీవో కార్యాలయంలో నిన్న జరిగిన 16వ సామాజిక తనిఖీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలపై రూ.85,951 రికవరీ, పెనాల్టీ మొత్తాన్ని ఉపాధి హామీ ఖాతాలో జమ చేయాలని అధికారులను ఆదేశించారు.