TG: రాష్ట్రంలోని రెండు రాజ్యసభ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసేందుకు సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానంతో భేటీ అయి తుది పేర్లను ప్రకటించనున్నారు. ఇప్పటికే ఒక సీటును సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించినట్లు సమాచారం. రెండో స్థానం కోసం పలువురు రాష్ట్ర నేతలు పోటీ పడుతుండగా, సామాజిక సమీకరణల ఆధారంగా ఎంపిక ఉండనుంది.