AKP: జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు ఎలమంచిలి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై రాత్రి సమయాల్లో ప్రమాదాల నివారణకు ఇల్యూమినేషన్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయాల్లో వెలుతురు సరిగా లేని షేకిళ్లపాలెం, మర్రిబంద,పోతిరెడ్డిపాలెం గ్రామాల వద్ద నేషనల్ హైవే అథారిటీ వారి సహకారంతో వీటిని ఏర్పాటు చేయడం జరిగిందని రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు.