సత్యసాయి: పెనుకొండ మండలంలోని మంత్రి సవిత నివాసంలో మంగళవారం అంగరంగ వైభవంగా హోలీ సంబరాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంత్రి సవిత రంగులు చల్లుకుంటూ ఆనందంగా వేడుకలు జరుపుకున్నారు. మంత్రి మాట్లాడుతూ.. అందరి జీవితాలు రంగులమయంగా ఉండాలని, ప్రతి ఒక్కరికి సంతోషం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.