RR: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం లాంటిదని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మజీద్ మామిడిపల్లి గ్రామంలో శివలింగం అనే వ్యక్తికి మంజూరైన రూ.60 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును బుధవారం ఎమ్మెల్సీ అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజలు అత్యవసర వైద్య సహాయార్థం సీఎంఆర్ఎఫ్ సేవలను వినియోగించుకోవాలన్నారు.