SKLM: నరసన్నపేట పట్టణంలో అన్న క్యాంటీన్ భవన నిర్మాణానికి ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గురువారం భూమి పూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన అన్న క్యాంటీన్ భవన నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు. వేలాది మంది పేదలు, కూలీలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. ఈ క్రమంలో పలువురు నాయకులు, తదితరులు ఉన్నారు.