GNTR: పెదనందిపాడు పీహెచ్సీ పరిధిలోని వరగాని గ్రామంలో మంగళవారం ‘స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్, పెద్దల చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో భాగంగా కౌమార దశలోని బాలికలకు, గర్భిణీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్, క్షయ వ్యాధి స్క్రీనింగ్తో పాటు పోషకాహారంపై ప్రజలకు అవగాహన కల్పించారు.