NZB: శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఇన్ఫ్లోగా 5,907 క్యూసెక్కుల నీరు వచ్చి చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. దిగువకు 654 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు పేర్కొన్నారు. కాకతీయ కెనాల్కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని వదులుతున్నామని తెలిపారు. ప్రస్తుతం SRSPలో 1,066.20అడుగుల నీటిమట్టం ఉంది.