NLR: చేజర్లలో గురువారం జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా బస్టాండ్ సెంటర్లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఇంటింటికి తిరిగి ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.