ELR: సీడ్ మొక్కజొన్నను సాగు చేసిన తమకు కంపెనీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన రైతులు సోమవారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఏషియన్ సీడ్స్ కంపెనీ తమతో విత్తనం మొక్కజొన్న సాగు చేయించగా కంపెనీ చెప్పిన విధంగా దిగుబడి రాలేదన్నారు. దీంతో తమకు నష్టం వాటిల్లిందని వాపోతున్నారు.