NLR: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ముత్తుకూరు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా నేడు, రేపు పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు. నెల్లూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో కాకాణిని పలు ప్రశ్నలపై ఆరా తీయనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్రమ టోల్ గేట్ కేసులో ఆయనపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందేనని పోలీసులు తెలిపారు.