E.G: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు తమ అర్జీలను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆమె ఆదేశించారు.