KMR: బీబీపేట మండల కేంద్రంలో ఈ నెల 8వ తేదీ (ఆదివారం) నుంచి పశువుల సంత ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెద్దమ్మ గుడి వెనుక భాగంలో ఈ సంతను ఏర్పాటు చేశారు. ఇందులో ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మేకల కొనుగోలు, విక్రయాలు జరుగుతాయని పంచాయతీ వర్గాలు తెలిపాయి. బీబీపేటతో పాటు పరిసర గ్రామాల రైతులు, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.