SKLM: సీఎం చంద్రబాబు విద్యకు పెద్దపీట వేస్తున్నారని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కొనియాడారు. కాశీబుగ్గ సాయి కాలనీలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలను గురువారం నూతనంగా ప్రారంభించారు. మొదటి విద్యార్థి అడ్మిషన్ చేసి పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు తీసుకుంటున్నారని కొనియాడారు.