KRNL: ఆదోని మండలం ఢణాపురంలో జరిగిన కార్యక్రమంలో దళిత సర్పంచి అవమానానికి గురయ్యారని సామాజిక మాధ్యమాల్లో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై ఆదోని MLA పార్థసారథి స్పందించారు. “వీడియోను కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ఎడిట్ చేశారు. ఎవరికైనా బాధ కలిగితే, వారి భావాలను గౌరవిస్తూ క్షమాపణ చెబుతున్నాను” అని తెలిపారు.