VSP: విశాఖలో శుక్రవారం డీఎస్సీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్.ప్రేమ్ కుమార్ అన్నారు. శుక్రవారం జరిగిన పరీక్షల్లో 4,151 పరీక్ష రాయాల్సి ఉండగా 3,979 మాత్రమే హాజరయ్యారని అన్నారు. ఈమేరకు డీఈవో ఒక పరీక్ష కేంద్రం నేరుగా సందర్శించారన్నారు. అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు నాలుగు పరీక్ష కేంద్రాలను పరిశీలించాయన్నారు.