కాకపోతే శేఖర్ కమ్ముల చాకచక్యంగా అదే పాతకథని కొత్తగా వండివార్చి ధనుష్కి వడ్డించేశాడు. శేఖర్ కమ్ములకున్న ఫేమ్ అండ్ నిర్మాతలకున్న స్టామినాని నమ్మి ధనుష్ డేట్స్ గుమ్మరించేశాడు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ప్రాజెక్టు మూడేళ్ళ తర్వాత ధియేటర్లకి వెళ్తోంది.
బాప్రే….మామ్మూలు సాదాసీదా కథతో తీసిన సినిమాకి 150 కోట్ల బడ్జెట్టా…అవును అక్షరాల నిజమే. ధనుష్ కధానాయకుడిగా, యువసమ్రాట్ నాగార్జున సపోర్టింగ్ రోల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోమనరావు సంయుక్తంగా నిర్మిస్తున్న కుబేర చిత్రం ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా కథ పక్కన బెడితే కథ వెనుక కథే చాలా ఆసక్తికరంగానూ, ట్రేడ్కే గుండెలదిరే కథ ఉందంటే నమ్మలేం.
కుబేర చిత్రం కథ ఏమంత కొత్త కధేంకాదు. ఎన్నోసార్లు, ఎన్నో భాషల్లో, ఎందరో హీరోలు చేసిన పాతచింతకాయ పచ్చడే. కాకపోతే శేఖర్ కమ్ముల చాకచక్యంగా అదే పాతకథని కొత్తగా వండివార్చి ధనుష్కి వడ్డించేశాడు. శేఖర్ కమ్ములకున్న ఫేమ్ అండ్ నిర్మాతలకున్న స్టామినాని నమ్మి ధనుష్ డేట్స్ గుమ్మరించేశాడు. ఎప్పుడో మూడేళ్ళ క్రితం ప్రారంభమైన ప్రాజెక్టు మూడేళ్ళ తర్వాత ధియేటర్లకి వెళ్తోంది. ఇక్కడే తిరకాసు. ఇటువంటి కథని తెరకెక్కించడానికైతే ఓ అర్నెల్లు నుంచి మహా అయితే ఏడాది కాలం పడుతుంది. అంత కన్నా ఎక్కువ టైం పట్టడానికి ఇదేం బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి హ్యూజ్ స్పేన్ ఉన్న సినిమా కానేకాదు. మరెందుకు ఇన్నాళ్ళు పట్టింది? అదే ఇక్కడ మిలియన్ డాలర్ల ప్రశ్న.
శేఖర్ కమ్ముల తీరిగ్గా, తాపీగా, నాజూగ్గా, వీలైనంత హాయిగా సినిమాని షూట్ చేయడం మొదలు పెట్టాడు. తెలుగు దర్శకుల మీద ఈ మధ్య ఇతర భాషా నటీనటులకు ఎంతో కొంత మోజు పెరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించనక్కర్లేదు. ఆ మోజే శేఖర్ కమ్ముల పట్ల కూడా ధనుష్ ఫీలయ్యాడు. ఎంత టైం తీసుకోవాలో అంత టైమూ తీసుకుని, శేఖర్ నిర్మాతలని ఉతికి ఆరేశాడని పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఇదే సినిమాని మరోక నిర్మాతైతే మొదట్లోనే వదిలించుకుని చేతులు దులిపేసుకునేవాడని చెబుతున్నారు
హీరో, డైరెక్టర్, ఆలిండియా లెవెల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న రష్మిక లాంటి హీరోయిన్లను అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న తర్వాత సినిమా కంప్లీట్ అవడానికి మధ్యన అయ్యే ఖర్చు ఇంతా అంతా కాదు. పైగా టార్గెట్ చేసిన రిలీజ్ టైం కూడా ఆర్నెల్ల క్రితమే. నిర్మాతలు అనుకున్న బడ్జెట్ కూడా 100 నుంచి 110 కోట్ల వరకే. కానీ సినిమా రిలీజ్కి వచ్చేసరికి అదికాస్తా 150 కోట్లు ఎలా అయింది? వడ్డీలు. నడ్డివిరిచే వడ్డీలు కొండెక్కి కూర్చున్నాయి. దాదాపుగా 30 కోట్లకు పైచిలుకే వడ్డీలు మాత్రమే అయ్యాయంటే ఆలోచించాల్సిన టైమిది.
కేవలం నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు కాబట్టే కుబేర సినిమా జరిగింది కానీ మరొకడు మరొకడు అయితేనా….మధ్యలోనే వదిలేసి పారిపోయవాడని పరిశ్రమంతా బాహాటంగానే మాట్లాడుతున్నారు. ఇది కేవలం దర్శకుడు శేఖర్ కమ్ముల నిర్వాకమేనని కూడా దుయ్యబడుతున్నారు. కానీ బ్యానర్ పరువుప్రతిష్టలను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు, వ్యయప్రయాసలకు ఓర్చుకుని, ఓపికతో కుబేర చిత్రాన్ని పూర్తి చేసి విడుదల స్థాయికి తెచ్చారనేది సర్వత్రా వినిపిస్తోంది.
ఖర్చు అయితే అయింది. వడ్డీలు వీరబాదుడు ఎలాగూ తప్పలేదు. కనీసం రిలీజై హిట్ అయితే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టవుంది. కాకపోతే రిలీఫ్ ఏంటంటే సినిమా బాగా వచ్చిందంటున్నారు. అదొక్కటే ప్లస్ పాయంట్.