NLR: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సమీపంలో గురువారం విమాన ప్రమాదం జరగడం చాలా బాధాకరమని ఎమ్మెల్సీ పర్వతి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందన్నారు. ఈ ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు 240 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.