కోనసీమ: మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో ప్రతివారం నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 16న ఉదయం 10 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జరుగుతుందని మంత్రి కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళాలో మెడ్ ప్లస్, మెట్రోకేమ్, టీమ్ లీజ్ లాంటి పలు కంపెనీలు హాజరుకానున్నట్లు పేర్కొంది. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.