MDK: శివంపేట మండలం లచ్చిరెడ్డి గూడెంలో శుక్రవారం ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రోసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సొంత స్థలం ఉండి ఇంటి నిర్మాణం చేపట్టాలనుకునే లబ్ధిదారులను గుర్తించి 8 మంది లబ్ధిదారులకు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.