SKLM: రణస్థలం హైస్కూల్లో శుక్రవారం విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం పధకానికి ప్రభుత్వం సన్నబియ్యం అందించడం గొప్ప విషయం అని అన్నారు.