ASR: అనంతగిరి మండలంలోని భీంపోలు పంచాయతీ పరిధి నేరేడువలసలో మంచినీటి సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు. కురుస్తున్న వర్షాలతో గ్రామంలో ఉన్న నేల బావిలో నీరు కలుషితమై వాటిని వినియోగించుకొని పలు రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ప్రభుత్వం స్పందించి తాగునీటి సమస్య పరిష్కరించాలని వారు కోరారు.