KMM: జిల్లాలో వాతావరణం మారడంతో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి, సత్తుపల్లి, మధిర, బోనకల్, ఏన్కూరు తదితర మండలాల్లో విష జ్వరాల బారిన పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని స్థానికులు తెలిపారు. విషజ్వరాల నివారణకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.