ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని మైదుకూరు సీఐ రమణారెడ్డి అన్నారు. గురువారం రాత్రి జీవి సత్రంలో ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.