CTR: అసంబద్ధ బదిలీలను వెంటనే ఆపాలని ఉపాధ్యాయులు శుక్రవారం చిత్తూరులో రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలు జరపాలని వారు డిమాండ్ చేశారు. స్పాస్ బదిలీలపై అధికారుల వైఖరి నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా విద్యాశాఖలో నియంత పోకడ ఉందని వారు ఆరోపిస్తూ కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.