SKLM: కోటబొమ్మాళి మండలం వైశ్య వీధికి చెందిన చిన్న పిండి మిల్లు నడుపుతున్న మల్ల రమేశ్ (45) సోమవారం విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. పిండి మిల్లుపై ఆధారపడుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ తరుణంలో మిల్లు స్టార్ట్ చేసిన సమయంలో విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు.