SRCL: తమ భూములను ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని అనంతారం రైతులు ఆరోపించారు. ఇల్లంతకుంటలోని MRO ఆఫీస్ ముందు సోమవారం వారు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 70 సంవత్సరాలుగా దున్నుకుంటూ సాగు చేసుకుంటున్న భూమిని అటవీ అధికారులు వచ్చి హద్దులు పెట్టాలనిచూస్తున్నారని వాపోయారు. అధికారులకు వినతి పత్రం అందించినా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.