మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల CPI ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 15న నిర్వహించనున్న CPI మండల మహాసభను విజయవంతం చేయాలన్నారు. ప్రజా, కార్మిక, రైతు సమస్యలపై నిరంతరం పోరాడే ఏకైక పార్టీ CPI అన్నారు.